బ్రిటన్‌లో తెలుగు విద్యార్థుల కష్టాలు

ABN , First Publish Date - 2020-04-01T22:24:26+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది.

బ్రిటన్‌లో తెలుగు విద్యార్థుల కష్టాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటుంది. ఇప్పటికే 190 దేశాలకు వ్యాప్తించిన కోవిడ్-19.. ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఇరాన్, బ్రిటన్, ఐరోపా దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. సగానికిపైగా దేశాలు  లాక్‌డౌన్ వ్యూహం పాటిస్తున్నప్పటికీ బాధితులు, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.


ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. అష్టకష్టాలుపడుతున్నారు. న్యూ కాజిల్‌లో ఉన్న కార్తిక్ అనే తెలుగు విద్యార్థి వాట్సాప్ ద్వారా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఇక్కడ తెలుగు విద్యార్థులు ఎక్కువమంది ఉన్నారన్నారు. ఇవాళ 201 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎక్కడకు వెళ్లాలో తెలియక మూడు వారాలనుంచి లాక్‌డౌన్ చేసుకుని ఉన్నామని, చాలా భయంగా ఉందని, తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నామని కార్తిక్ తెలిపారు.

Updated Date - 2020-04-01T22:24:26+05:30 IST