సభ్యత్వ నమోదులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి

ABN , First Publish Date - 2022-01-24T05:49:15+05:30 IST

కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కార్యకర్తలు కృషిచేయాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత శంకర్‌నాయక్‌ అన్నారు.

సభ్యత్వ నమోదులో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి

వేములపల్లి/మాడ్గులపల్లి, జనవరి 23: కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కార్యకర్తలు కృషిచేయాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత శంకర్‌నాయక్‌ అన్నారు. ఆదివారం ఆయా మండలాల్లో నిర్వహించిన స మావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చే స్తున్న అరాచక పాలనను తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్తకు రూ.2 లక్షల ఉచిత బీమా ఇన్సూరెన్స లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు రావు ఎల్లారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అర్జున, జడ్పీటీసీ సైదులు, నాయకులు పుట్టల కృప య్య, వీరయ్య, రవీందర్‌రెడ్డి, వినోద్‌, క్రాంతి, ఉపేందర్‌, సై దాబా బు, సైదిరెడ్డి, మాధవరెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.


Updated Date - 2022-01-24T05:49:15+05:30 IST