మిట్ట మధ్యాహ్నం.. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు పక్కన శునకాల ఫైటింగ్.. తరిమి కొడదామని వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడ కనిపించిన సీన్ చూసి..

ABN , First Publish Date - 2021-11-23T17:48:24+05:30 IST

పొలంలో పడివున్న 10 రోజుల బాలిక మృతదేహాన్ని..

మిట్ట మధ్యాహ్నం.. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు పక్కన శునకాల ఫైటింగ్.. తరిమి కొడదామని వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడ కనిపించిన సీన్ చూసి..

పొలంలో పడివున్న 10 రోజుల బాలిక మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఉదంతం వెలుగుచూసింది. రాజస్థాన్‌లోని రాహ్‌గిరీ‌లో మిట్ట మధ్యాహ్నం వేళ.. నిర్మానుష్యంగా ఉన్న ఆప్రాంతంలో వీధి కుక్కలు ఒకచోట గుంపుగా చేరడాన్ని గమనించిన ఓ వ్యక్తికి అనుమానం వచ్చింది. వాటిని తరిమికొడదామని, దగ్గరకి వెళ్లి చూడగా, అక్కడ అతనికి ఒక బాలిక మృతదేహం కనిపించింది.


ఆ మృతదేహంలోని చాలా అవయవాలను కుక్కలు అప్పటికే పీక్కు తినేశాయి. ఈ విషయాన్ని అతను ఆ పొలం యజమానికి, గ్రామస్తులకు, పోలీసులకు తెలియజేశాడు. ఈ ఘటన ఖున్ఖునా పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనియాడా గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఈ ఘటన మూడు రోజుల క్రితమే జరిగివుంటుందని భావిస్తున్నారు. వారు ఆ మృతదేహాన్ని ఖూట్ సీహెచ్సీ మార్చురీకి తరలించారు. ఆడ శిశువు కావడంతోనే తల్లిదండ్రులు ఇలా వదిలించుకునివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


Updated Date - 2021-11-23T17:48:24+05:30 IST