ఏపీజీబీ ఉద్యోగుల విరాళం రూ.50 లక్షలు
ABN , First Publish Date - 2020-04-08T09:15:40+05:30 IST
సీఎం సహాయనిధికి ఏపీజీబీ ఉద్యోగులు రూ.50లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్బాష, ఎంపీ అవినాష్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్
కడప (కలెక్టరేట్), ఏప్రిల్ 7: సీఎం సహాయనిధికి ఏపీజీబీ ఉద్యోగులు రూ.50లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్బాష, ఎంపీ అవినాష్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ హరికిరణ్ సమక్షంలో ఏపీజీబీ చైర్మన్ ఎ.వెంకటరెడ్డి రూ.50 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు 2425 సిబ్బంది ఒకరోజు వేతనంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నామన్నారు. సహకరించిన సిబ్బందికి, ఉద్యోగ సంఘాల లీడర్లకు కృతజ్ఞతలు తెలిపారు.