ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొని మినీ ట్రక్కు డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2021-12-04T04:04:50+05:30 IST
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై గురువారం రాత్రి ముందు వె ళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని మినీ ట్రక్కు ఢీకొని డ్రైవర్ మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది.
రాజాపూర్, డిసెంబరు 3 : మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై గురువారం రాత్రి ముందు వె ళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని మినీ ట్రక్కు ఢీకొని డ్రైవర్ మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం.. హైదరాబాద్లోని కాటేదాన్ ప్రాంతంలో ఉంటూ మినీ ట్రక్కు డ్రైవర్గా పని చేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన వివేక్కుమార్ సాహు గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి రాయిచూర్ వెళ్తుండగా మార్గమధ్యలో రాజాపూ ర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలోని జా తీయ రహదారిపై ముందు వెళ్తున్న గుర్తు తెలి యని వాహనాన్ని ఢీకొనడంతో ఛాతికి, కాళ్లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు వివరించారు. వివేక్కుమార్ సాహు కుటుంబీకు లైన అనిల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.