నిత్యావసరాలు అధిక ధరకు

ABN , First Publish Date - 2020-03-30T09:05:24+05:30 IST

నిత్యావసరాలు అధిక ధరలకు విక్ర యించకుండా చర్యలు చేపట్టినట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి

నిత్యావసరాలు అధిక ధరకు

విక్రయిస్తే చర్యలు: మంత్రి విశ్వరూప్‌


అమలాపురం టౌన్‌, మార్చి 29: నిత్యావసరాలు అధిక ధరలకు విక్ర యించకుండా చర్యలు చేపట్టినట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు. నిరుపేదలకు బియ్యంతోపాటు కందిపప్పు ఉచి తంగా ఇస్తునట్టు చెప్పారు. అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలోని రైతుబజార్‌, చేపల మార్కెట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా ఎస్టేట్‌ అధి కా రులకు ఆదేశాలు జారీచేశామన్నారు. ఆక్వా రైతుల వద్ద ఉన్న రొయ్యలను ప్రాసెసింగ్‌ యూనిట్లు కొనేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.


ఆక్వా రైతులను ఆదు కునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎమర్జెన్సీ రోగులకు తక్షణ వైద్యసేవలు అందజేస్తారని తెలిపారు. అయినవిల్లి మండలం విలసకు చెందిన ఓ వ్యక్తికి కరోనా నెగిటివ్‌గా రావ డంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారని తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ కేవీఆర్‌ఆర్‌ రాజు ఉన్నారు.

Updated Date - 2020-03-30T09:05:24+05:30 IST