మిల్లర్ల దోపిడీని అరికట్టాలి

ABN , First Publish Date - 2021-11-27T05:27:55+05:30 IST

రైతులు కష్టపడి పండించిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాల్లో తప్పా తాలు పేరుతో మిల్లర్ల దోపిడిని అరిక ట్టాలని కిసాన్‌మోర్చా జిల్లా అధ్యఓఉడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి ప్ర భుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
ఆత్మనగర్‌లోని కొనుగోలు కేందకేంద్రాన్ని పరిశీలించిన గోపాల్‌రెడ్డి

- కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి

మెట్‌పల్లి రూరల్‌, నవంబరు, 26: రైతులు కష్టపడి పండించిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాల్లో తప్పా తాలు పేరుతో మిల్లర్ల దోపిడిని అరిక ట్టాలని కిసాన్‌మోర్చా జిల్లా అధ్యఓఉడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి ప్ర భుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని ఆత్మనగర్‌ గ్రా మంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి స మస్య లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొంటానని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాట మార్చుతూ కేంద్రంపై విమర్శలు చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించ డం సరి కాదన్నారు. యాసంగి పంటల సాగుపై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలన్నారు. రైతు సమస్యలను పరిష్కరించకుంటే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్య క్రమం లో బీజేపీ మండలాధ్యక్షుడు కొమ్ముల రాజ్‌పాల్‌రెడ్డి, కిసాన్‌ మోర్చా, బీజేవైఎం మండలాధ్యక్షులు మారు జనార్ద న్‌రెడ్డి, పీసు రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, రమేశ్‌, గంగారెడ్డి, శివ, పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T05:27:55+05:30 IST