రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం

ABN , First Publish Date - 2020-09-23T07:06:50+05:30 IST

నాగిరెడ్డిగారిపల్లె గ్రామం వట్టంవాండ్లపల్లెకు చెం దిన రైతు చింతకుంట రెడ్డెప్పరెడ్డి (50) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో దుర్మరణం చెందాడు. పోలీసుల కథ నం మేరకు... రెడ్డెప్పరెడ్డి మల్లూరువాళ్లపల్లె సమీపంలో ఉన్న తన పొలం వద్దే ఇల్లు నిర్మిం

రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం


సంబేపల్లె, సెప్టెంబరు 22: నాగిరెడ్డిగారిపల్లె గ్రామం వట్టంవాండ్లపల్లెకు చెం దిన రైతు చింతకుంట రెడ్డెప్పరెడ్డి (50) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో దుర్మరణం చెందాడు. పోలీసుల కథ నం మేరకు... రెడ్డెప్పరెడ్డి మల్లూరువాళ్లపల్లె సమీపంలో ఉన్న తన పొలం వద్దే ఇల్లు నిర్మించుకున్నాడు. ఎంతో కష్టపడి పంటలు పండించుకుని కుటుం బాన్ని పోషించుకునే వాడు.


ఈ నేపథ్యంలో మంగళవారం తాను పండించిన పచ్చి మిరపకాయలను అమ్ముకునేందుకు ద్విచక్రవాహనంపై సంబేపల్లె సంతకు తీసుకెళుతుండగా కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లారీ తల పైభాగంలో వెళ్లడంతో తల పూర్తిగా చెదిరిపోయింది. కుటుంబ యజమాని మృతి చెందడంతో తన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె బోరున విలపించారు.


రెడ్డెప్పరెడ్డి భార్య ఈశ్వరమ్మ, తన ముగ్గురు బిడ్డలు ‘దేవుడా మాకు దిక్కెవ్వరు’ అంటూ గుండెలు అవిసేలా రోదించారు. ఎస్‌ఐ రాజారమేష్‌, హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రనారాయణ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-09-23T07:06:50+05:30 IST