ఆంక్షలు లేకుండా రైతుబంధు అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-05-28T09:53:32+05:30 IST
రైతుబంధు పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని బుధవారం కలెక్టర్కు బీజేపీ
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్జిల్లా ప్రతినిధి): రైతుబంధు పథకాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని బుధవారం కలెక్టర్కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. వానాకాలంలో వ్యవసాయ అధికారులు సూచించిన పంటలను సాగుచేస్తేనే రైతుబంధు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం విచారకరమన్నారు. రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. వినతి ఇచ్చిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు, రాష్ట్రఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు విక్రంరెడ్డి, భీంరావు, సత్తిరెడ్డి, మోహన్రెడ్డి, తిరుమల్రెడ్డి, బాల్రాజ్ ఉన్నారు.