Very sad: అర్ధరాత్రి ఇంటికొచ్చిన కూతురు.. ఇంతసేపు ఎక్కడికెళ్లావంటూ నిలదీసిన తండ్రి.. ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-10-12T22:14:45+05:30 IST

అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కూతురును చూసిన జాదవ్.. ఇంత సేపు ఎక్కడున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను దసరా ఉత్సవాల్లో పాల్గొన్న విషయం గురించి చెప్పింది. ఇంతవరకు ఎవరితో తిరుగుతున్నావంటూ ఆగ్రహంతో కుమార్తెపై..

Very sad: అర్ధరాత్రి ఇంటికొచ్చిన కూతురు.. ఇంతసేపు ఎక్కడికెళ్లావంటూ నిలదీసిన తండ్రి.. ఆమె చెప్పింది విని..

ఇంట్లో కూతురు ఉందంటే మహాలక్ష్మి ఉన్నట్టే.. అలాంటి కుమార్తెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ తండ్రి చేసిన పని చూస్తే.. ఇలాంటి తండ్రులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అంటారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా పట్టణంలో జాదవ్ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి పదేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మొరెనా పట్టణంలో జరుగుతున్న ఉత్సవాలకు ఆ బాలిక స్నేహితులతో కలిసి వెళ్లింది. అక్కడ సరదా సరదాగా గడిపింది. ఉత్సవాల సందడిలో పడి సమయం కూడా మర్చిపోయారు. తీరా చూస్తే.. రాత్రి 11అయింది. తర్వాత ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు.


అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కూతురును చూసిన జాదవ్.. ఇంత సేపు ఎక్కడున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను దసరా ఉత్సవాల్లో పాల్గొన్న విషయం గురించి చెప్పింది. ఇంతవరకు ఎవరితో తిరుగుతున్నావంటూ ఆగ్రహంతో కుమార్తెపై.. కర్రతో దాడి చేశాడు. ‘‘నాన్నా.. ఇంకెప్పుడూ ఆలస్యంగా రాను.. కొట్టొద్దు నాన్నా’’.. అంటూ ఆ బాలిక వేడుకుంటున్నా... కనికరం చూపలేదు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో బాలిక.. అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేసి, బాలిక మృతదేహాన్ని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జాదవ్‌కు మద్యం సేవించే అలవాటు ఉందని, రోజూ భార్యా కుమార్తెను వేధించేవాడని పోలీసు విచారణలో తేలింది. 

Updated Date - 2021-10-12T22:14:45+05:30 IST