జమునా హేచరీస్ భూములలో ముగిసిన మొదటి సర్వే
ABN , First Publish Date - 2021-11-17T01:54:20+05:30 IST
మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో గల జమునా హేచరీస్ భూములపై
మెదక్: మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో గల జమునా హేచరీస్ భూములపై మొదటి సర్వే ముగిసింది. 130 సర్వే నెంబర్లోని 18-35 ఎకరాల భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే చేశామని మాసాయిపేట తహశీల్దార్ మాలతి తెలిపారు. ఈ నెల 18న సర్వే నివేదిక అందిస్తామని తహశీల్దార్ పేర్కొన్నారు.