ఫిర్యాదుల వెల్లువ
ABN , First Publish Date - 2021-08-03T06:56:10+05:30 IST
కలెక్టరేట్లో సోమ వారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ సమస్యలు పరి ష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మికి విన్నవించారు.
కలెక్టర్కు సమస్యలపై అర్జీలు
త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్
492 ఫిర్యాదుల స్వీకరణ
అనంతపురం అర్బన్, ఆగస్టు 2 : కలెక్టరేట్లో సోమ వారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ సమస్యలు పరి ష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మికి విన్నవించారు. సంవత్స రాల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించు కోకపోవడంతో జిల్లా కేంద్రానికి రావాల్సివస్తోందని పలు వురు బాధితులు వాపోయారు. వివిధ సమస్యలపై 492 అర్జీలు వచ్చాయి. వీటిలో ఎక్కువగా పెన్షన్, బియ్యం కా ర్డులు, భూ సమస్యలపై వచ్చినట్లు అధికారులు తెలిపారు. బాధితుల సమస్యలకు త్వరగా పరిష్కారం చూపాలని కలెక్టర్ నాగలక్ష్మి అఽధికారులను ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో బాధితులనుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, సిరి, గంగాధర్ గౌడ్, డీఆర్ఓ గాయత్రీదేవి, ఆర్డీ ఓ మధుసూదన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.