ఐసొలేషన్ కేంద్రంగా అడవి

ABN , First Publish Date - 2021-06-03T18:13:48+05:30 IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: యత్నారం అడవీ గ్రామంలో కరోనా విజృంభించింది.

ఐసొలేషన్ కేంద్రంగా అడవి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: యత్నారం అడవీ గ్రామంలో కరోనా విజృంభించింది. మూడు రోజుల వ్యవధిలో 34 మంది కరోనా బారిన పడ్డారు. అయితే తమ వలన మిగతావారికి కరోనా సోకవద్దని గ్రామంలోని 7 కుటుంబాలకు చెందిన 20 మంది అడవినే ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నారు. అడవిలోనే ఉంటూ, అక్కడే వంట చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. తాము పూర్తిగా కోలుకున్న తర్వాతనే తిరిగి గ్రామంలోకి వెళతామని బాధితులు చెబుతున్నారు.

Updated Date - 2021-06-03T18:13:48+05:30 IST