కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న గల్లా కుటుంబం

ABN , First Publish Date - 2021-04-09T08:19:14+05:30 IST

తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో గురువారం మాజీ మంత్రి అరుణకుమారి, ఆమె భర్త, అమరరాజ సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేసుకున్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న గల్లా కుటుంబం
కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకుంటున్న అమరరాజ బ్యాటరీస్‌ సంస్థ అధినేత గల్లా రామచంద్ర నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌

తిరుపతి (వైద్యం), ఏప్రిల్‌ 8: తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో గురువారం మాజీ మంత్రి అరుణకుమారి, ఆమె భర్త, అమరరాజ సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేసుకున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా వ్యాక్సిన్‌ వేసుకోవాలని, తద్వారా కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చని వారు తెలిపారు. ఇక, స్విమ్స్‌ శ్రీపద్మావతి మహిళా వైద్యశాల (రాష్ట్ర కొవిడ్‌ హాస్పిటల్‌) నుంచి గురువారం 42 మంది కొవిడ్‌ బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. వీరిలో చిత్తూరు జిల్లా నుంచి 34 మంది, కడపజిల్లా నుంచి ముగ్గురు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు నుంచి ఒక్కొక్కరు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. ప్రస్తుతం 233 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్టు మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-09T08:19:14+05:30 IST