ప్రమాదవశాత్తు కాల్వలో పడి బాలిక మృతి
ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST
మండల పరిధిలోని మిడుతూరు వాసి ఎం.లక్ష్మి (16) అనే బాలిక ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందింది.
ఖాజీపేట, మే 13: మండల పరిధిలోని మిడుతూరు వాసి ఎం.లక్ష్మి (16) అనే బాలిక ప్రమాదవశాత్తు కాల్వలో పడి మృతి చెందింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ఎం.వెంకటరమణ, రంగమ్మ దంప తుల కుమార్తె లక్ష్మి ఇంటి బయట ఆడుకుంటూ సమీప కేసీ కెనాల్ కాల్వలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. సంఘటన స్థలానికి ఏఎస్ఐ రాజగోపాల్రెడ్డి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.