కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-26T04:13:52+05:30 IST

కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా ఏఐటీయూసీ పోరాడుతుందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు

కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం
మంచిర్యాలలో పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఏఐటీయూసీ నాయకులు

- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు
మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 25: కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా ఏఐటీయూసీ పోరాడుతుందని  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు అన్నారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ కౌన్సిల్‌ సమావేశాల పోస్టర్లను  నాయకులు ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు హైద్రాబాద్‌లో ఏఐటీయూసీ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించనున్నామని చెప్పారు. నరేంద్ర మోదీ కార్మిక వర్గంపై దాడి, పరిశ్రమలను ప్రైవేటీకరించడం తదితర అంశాలపై రాజీలేని పోరాటాలు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు ఇప్పకాయల లింగయ్య, రామడుగు లక్ష్మణ్‌, పౌలు, సంపత్‌, పోచన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T04:13:52+05:30 IST