ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , First Publish Date - 2020-10-21T11:51:18+05:30 IST
మండలంలోని గంపరాయి గ్రామంలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు.
అరకులోయ ఎమ్మెల్యే ఫాల్గుణ
పెదబయలు, అక్టోబరు 20: మండలంలోని గంపరాయి గ్రామంలో అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందడమే లక్ష్యమన్నారు. తమకు తాగు నీరు, రోడ్డు సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరారు. ఈ సమస్యల పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ఫాల్గుణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు ఆనందరావు, నేతలు బొంజుబాబు, కొండబాబు, కనకరాజు పాల్గొన్నారు.