ఆ ఏడు బిల్లులకు గవర్నర్ ఆమోదం
ABN , First Publish Date - 2020-09-23T08:22:46+05:30 IST
తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఆమోదం పొందిన బిల్లులన్నీ చట్టంగా మారాయి.
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఆమోదం పొందిన బిల్లులన్నీ చట్టంగా మారాయి. తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్పుస్తకాల చట్టం-2020, తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టుల రద్దు చట్టం-2020, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ చట్టం-2020, తెలంగాణ పురపాలక సవరణ చట్టం-2020, తెలంగాణ భవన నిర్మాణ అనుమతుల స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్ బీపాస్) చట్టం-2020, తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాట్ల చట్టం-2020, తెలంగాణ జీఎస్సీ రెండో సవరణ చట్టం-2020 గవర్నర్ తమిళిసై ఆమోదం పొందాయి.
ఈనెల 16న ఈ బిల్లులన్నీ శాసనసభ, మండలి ఆమోదం పొందగా మరుసటి రోజే వాటిపై గవర్నర్ సంతకం చేశారు. ఈనెల 19న ఆయా బిల్లులు చట్టాలుగా మారినట్లు పరిగణనలోకి తీసుకుంటూ న్యాయశాఖ జీవోలు జారీ చేసింది. దీని ఆధారంగా గెజిట్లు విడుదల చేయనున్నారు. ఇదే క్రమంలో ఆయా చట్టాలకు అనుబంధంగా నియమాలను కూడా విడుదల చేయనున్నారు.