గ్రామసభ తీర్మానానికి విలువ లేదా
ABN , First Publish Date - 2020-07-12T09:46:03+05:30 IST
గ్రామసభ ఇసుక తీర్మానానికి వ్యతిరేకంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు.
చట్టవిరుద్దంగా ఇసుక తరలిస్తే అడ్డుకుంటాం
భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య
భద్రాచలం, జూలై 11: గ్రామసభ ఇసుక తీర్మానానికి వ్యతిరేకంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య విమర్శించారు. భద్రాచలంలో శనివారం వివిధ రాజకీయ పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం పట్టణ ప్రజలకు ఇసుక ఇవ్వకుండా డబుల్బెడ్రూం ఇళ్ల పేరుతో ఖమ్మం తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఇసుక తరలింపును స్థానిక గిరిజన మహిళ సొసైటీకి చెందిన సభ్యులు అడ్డుకున్నారు. ఇసుకను ఖమ్మం తరలిస్తున్నారనే సమాచారంతో మహిళలు అక్కడికి వెళ్లి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు.