ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-07-07T10:40:19+05:30 IST
లా నేస్తం పథకం కింద మూ డు సంవత్సరాల లోపు జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని జనసేన
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 6 : లా నేస్తం పథకం కింద మూ డు సంవత్సరాల లోపు జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుంకర సాయిబాబా డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం లీగల్ సెల్, బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. జూనియర్ న్యాయవాదులకు గత మూడు నెలల నుంచి స్టైఫండ్ను నిలుపుదల చేయడం దా రుణమన్నారు. ప్రభుత్వం న్యాయవాదులకు ఇస్తామన్న రూ.100 కోట్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో లీగల్ సెల్ ప్రతినిధులు గంటా శ్రీనివాసరావు, పీవీ నారాయణ, సుజాత, రమేష్, లక్ష్మణ్, బీజేపీ న్యాయవాది గోలి నాగేశ్వరరావు, చిట్టెం ప్రసాద్, కల్యాణ్ ముత్యాల, రాజేష్ పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో న్యాయవాదులు, వారివద్ద పనిచేసే గుమస్తాలకు ఆర్థిక సాయం అందించాలని ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు ఒక ప్రకటనలో కోరారు.