పట్టాలపై వ్యక్తి తల భాగం
ABN , First Publish Date - 2021-04-19T05:11:53+05:30 IST
ఇక్కడి రైల్వే స్టేషన్లోని మూడో నంబరు ప్లాట్ఫాం చివరన బ్రిడ్జి కింద పట్టాలపై ఆదివారం ఓ వ్యక్తి తలభాగాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు.
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 18 : ఇక్కడి రైల్వే స్టేషన్లోని మూడో నంబరు ప్లాట్ఫాం చివరన బ్రిడ్జి కింద పట్టాలపై ఆదివారం ఓ వ్యక్తి తలభాగాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మొండెం ఎక్కడా పరిసర ప్రాంతాల్లో కనిపించలేదని జీఆర్పీ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 40 ఏళ్ల ఉంటాయని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.