చెన్నమనేని రమేష్ కేసు విచారణను ఈనెల 15కు వాయిదా వేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-07-06T20:37:22+05:30 IST

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.

చెన్నమనేని రమేష్ కేసు విచారణను ఈనెల 15కు వాయిదా వేసిన  హైకోర్టు

హైదరాబాద్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఆఫ్‌లైన్‌లో దాఖలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 15కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 15న అందరూ వాదనలు వినిపించాలి, సమయం కోరవద్దని హైకోర్టు ఆదేశించింది.


వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే హైకోర్టులో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కౌంటర్ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేసిట్లు చెన్నమనేని రమేష్ తెలిపారు. చెన్నమనేని రమేష్ కౌంటర్ పై నేడు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. నేడు ఇరువైపుల వాదనలను హైకోర్టు విననుంది.

Updated Date - 2021-07-06T20:37:22+05:30 IST