అత్యధిక ఉష్ణోగ్రత నమోదయేది ఇక్కడే!
ABN , First Publish Date - 2020-10-02T06:45:38+05:30 IST
భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఎక్కడుందో తెలుసా? అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లో...
భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఎక్కడుందో తెలుసా? అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లో. ఆ ప్రాంతం విశేషాలివి...
మన దగ్గర వేసవికాలం మే నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఆ ఎండకే మనం అల్లాడిపోతుంటాం. అలాంటిది డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఒళ్లు కాలిపోయేంత వేడి ఉంటుంది. ఇక్కడ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
ఇప్పటి వరకు భూమిపై ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయింది ఈ ప్రాంతంలోనే. దాంతో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడుతుంటారు.
అక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ థర్మామీటర్ దగ్గర కార్లలో ఏసీ వేసుకుని కూర్చుంటారు. అత్యధిక ఉష్ణోగ్రత చూపించగానే పరుగున వెళ్లి సెల్ఫీలు దిగుతారు.
ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రత కూడా ఎక్కువే ఉంటాయి.