భార్యను చంపిన భర్తకు ఐదేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-01-28T06:56:15+05:30 IST

భార్యను చంపిన భర్తకు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును జిల్లా జడ్జి వెల్లడించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌ గ్రామంలో రెండు సంవత్సరాల క్రింద కుర్మ కిష్టయ్య తన భార్య దుర్గవ్వ మద్య డబ్బుల విషయంలో తరుచూ గొడవలు జరిగేవి.

భార్యను చంపిన భర్తకు ఐదేళ్ల జైలు

కామారెడ్డి, జనవరి 27: భార్యను చంపిన భర్తకు ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును జిల్లా జడ్జి వెల్లడించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌ గ్రామంలో రెండు సంవత్సరాల క్రింద కుర్మ కిష్టయ్య తన భార్య దుర్గవ్వ మద్య డబ్బుల విషయంలో తరుచూ గొడవలు జరిగేవి.  దుర్గవ్వ, నిందితుడు కిష్టయ్య ఇద్దరు కలిసి పొలానికి వెళ్లారు. భార్య దుర్గవ్వపై కక్షతో పారతో తలపై కొట్టి చంపాడు. మృతురాలి తమ్ముడు పంపనోల్ల రమేష్‌ ఎల్లారెడ్డి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ శ్వేతా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కిష్టయ్యను అరె స్టు చేసి రిమాండ్‌కు ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్‌ పంపారు. కామారెడ్డి అదన పు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్‌ సాక్షులను విచారించి ఆధారాలను పరిశీలించగా నేరం రుజువైంది. నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షను విధించారు. ఎస్‌ఐ శ్వేతా, సీఐ రాజశేఖర్‌, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నందరమేష్‌, సాక్షులను కోర్టులో హాజరుపరుచటలో లైసెన్‌ ఆఫిసర్‌ హన్మండ్లు, కోర్టుడ్యూటీ ఆఫిసర్‌ బన్సిలాల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.

Updated Date - 2022-01-28T06:56:15+05:30 IST