మద్యం మత్తులో..భార్యను హత్య చేసిన భర్త

ABN , First Publish Date - 2020-09-21T06:01:24+05:30 IST

మండలంలోని రెబ్బనపల్లిలో మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేశాడు. రెబ్బనపల్లికి చెందిన బత్తుల లచ్చన్న 20 ఏళ్ల నుంచి మద్యానికి

మద్యం మత్తులో..భార్యను హత్య చేసిన భర్త

దండేపల్లి, సెప్టెంబరు 20: మండలంలోని రెబ్బనపల్లిలో మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేశాడు. రెబ్బనపల్లికి చెందిన బత్తుల లచ్చన్న 20 ఏళ్ల నుంచి మద్యానికి బానిసయ్యాడు. తాగుడు విషయంలో రోజు భార్య బత్తుల అమ్మాయి (52)తో గొడవ పడేవాడు. శనివారం అదే గ్రామం లో ఉంటున్న చిన్న కూతురు ముత్యం మల్లేశ్వరీ ఇంట్లో ఇద్దరు భోజనం చేశారు. లచ్చన్న తన ఇంటికి మద్యం తాగి వచ్చాడు. దీంతో అమ్మాయి అతడితో గొడవ పడింది. రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయం లో ఇంట్లో ఉన్న రోకలి కర్రతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ అమ్మాయి అక్కడిక క్కడే మృతి చెందింది.


ఆదివారం ఉదయం లచ్చన్న కూతురు మల్లేశ్వరి ఇంటికి వచ్చి మీ అమ్మను చంపానని తెలిపాడు.  దీంతో వారు ఇంటికి వెళ్లి చూడగా అమ్మాయి రక్తపు మడుగులో చనిపో యి ఉంది. దండేపల్లి పోలీసులకు సమాచారం అందించగా లక్షెట్టిపేట సీఐ నారాయణనాయక్‌, ఎస్సై శ్రీకాంత్‌ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. లచ్చన్నను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శ్రీకాంత్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-21T06:01:24+05:30 IST