భారత్ కీర్తి ప్రతిష్ఠల వృద్ధి కొనసాగుతోంది : మోదీ

ABN , First Publish Date - 2022-01-15T21:34:22+05:30 IST

ప్రపంచ అతి పెద్ద మిల్లీనియల్ మార్కెట్‌గా భారత దేశ కీర్తి ప్రతిష్ఠలు

భారత్ కీర్తి ప్రతిష్ఠల వృద్ధి కొనసాగుతోంది : మోదీ

న్యూఢిల్లీ : ప్రపంచ అతి పెద్ద మిల్లీనియల్ మార్కెట్‌గా భారత దేశ కీర్తి ప్రతిష్ఠలు బలపడటం కొనసాగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి ఇండస్ట్రీ 4.0 వరకు మన అవసరాలు, సామర్థ్యం అపరిమితమని చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన స్టార్టప్ కంపెనీలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. 


భారత దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్ నిరంతరం తనను తాను తెలుసుకుంటూ, అభివృద్ధి చెందుతోందన్నారు. నేర్చుకుంటూ, పరివర్తన చెందే నిలకడైన స్థితిలో ఇది ఉందన్నారు. మన దేశంలోని స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు 55 వేర్వేరు పరిశ్రమల్లో ఉన్నట్లు చెప్పారు. ఐదేళ్ళ క్రితం మన దేశంలో కనీసం 500 స్టార్టప్‌లు అయినా ఉండేవి కాదన్నారు. ఇప్పుడు వీటి సంఖ్య 60,000 దాటినట్లు తెలిపారు. స్టార్టప్‌లు నవ భారతానికి వెన్నెముక కాబోతున్నాయన్నారు.


‘‘మనం భారత దేశం కోసం కొత్తవాటిని కనుగొందాం, భారత దేశం నుంచే కనుగొందాం’’ అనే మంత్రాన్ని పాటించాలని యువతను కోరారు. ‘‘మీ కలలను స్థానిక స్థాయికే పరిమితం చేయవద్దని, ప్రపంచ స్థాయిలో కలలుగనాలని చెప్పారు. జనవరి 16న జాతీయ స్టార్టప్‌ల దినోత్సవం మన దేశంలో జరుగుతుందని తెలిపారు. 


Updated Date - 2022-01-15T21:34:22+05:30 IST