తెగుళ్లకు అధికారుల సూచనలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-10-15T06:32:49+05:30 IST
వరి, పత్తి పంటల్లో వ చ్చే తెగుళ్లపై అధికారుల సూచనలు తీసుకోని మందులను పిచికారి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్ ప్రసాద్ అన్నారు.
పెద్దపల్లి రూరల్, అక్టోబరు 14: వరి, పత్తి పంటల్లో వ చ్చే తెగుళ్లపై అధికారుల సూచనలు తీసుకోని మందులను పిచికారి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల్ ప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని చీకురాయి గ్రామంలో వరి, పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. ఈ సందర్భంగా పలు తెగుళ్లపై రైతులకు వివరించా రు. అనంతరం చీకురాయి రైతువేదికను సందర్శించి పథకా ల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెం ట ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.