న్యాయ వ్యవస్థ ఉన్నతమైంది
ABN , First Publish Date - 2021-10-17T05:54:35+05:30 IST
అన్నీ వ్యవస్థలకన్నా న్యాయవ్యవస్థ ఉన్నతమైందని గోదావరిఖని పిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పర్వతపు రవి అన్నా రు.
- న్యాయమూర్తి పర్వతపు రవి
కోల్సిటీ, అక్టోబరు 16: అన్నీ వ్యవస్థలకన్నా న్యాయవ్యవస్థ ఉన్నతమైందని గోదావరిఖని పిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పర్వతపు రవి అన్నా రు. కొమురంభీంఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్కు బదిలీపై వెళుతున్న పర్వతపు రవి దంపతులను శనివారం కోర్టు ఆవరణలో బార్అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థకు అపారమైన నమ్మకం కలిగిఉందన్నారు. ఇక్కడ ఐదేళ్ల పాటు న్యాయవాదు లు, ప్రజలు సహకరించారని, ఏ ఉద్యోగానికైనా బదిలీలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి టీఎస్పీ భార్గవి, జీఎస్ఎల్ ప్రియంక, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్రావు, కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్, న్యాయవాదులు ఇరికిళ్ల నర్సయ్య, చెలుకల పద్మజ, ముష్కె రవికుమార్, ముచ్చకుర్తి, భారతిచౌహాన్, ఎరుకల ప్రదీప్కుమార్, విశ్వేశ్వర్రావు, శంతన్కుమార్, మేడ చక్రపాణి, దుండె మల్లేష్, పులిపాక రాజ్కుమార్, శ్రీనివాస్, భూమయ్య పాల్గొన్నారు.