కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉంది

ABN , First Publish Date - 2022-01-24T04:34:15+05:30 IST

కేసీఆర్‌ ప్రభు త్వానికి ప్రజల ఆశీర్వాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉంది
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి

-  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి


వనపర్తి అర్బన్‌, జనవరి 23 : కేసీఆర్‌ ప్రభు త్వానికి ప్రజల ఆశీర్వాదం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో పెబ్బేరు మండలం యాపర్ల గ్రామానికి చెందిన పలువురికి మంత్రి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లా డుతూ ప్రతీ నిమిషం ప్రజల కోసం పనిచేస్తు న్నామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఆలోచిస్తున్నామని అన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కేంద్రం సహాయ నిరాక రణ చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ చైతన్య వంతమైన నేల అని, జాతీయ పార్టీలకు తెలం గాణలో స్థానం లేదన్నారు. అంతకుముందు క్యాం పు కార్యాలయంలో 112 మందికి కళ్యాణలక్ష్మీ చె క్కులు పంపిణీ చేసి వారితో కలిసి మంత్రి సహ పంక్తి భోజనం చేశారు. అంతకుముందు తెలం గాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, ఉపాధ్యక్షుడు డీ ఆర్‌కే నాయక్‌, కార్యదర్శులు శివప్రసాద్‌యాదవ్‌, కిరణ్‌కుమార్‌, మీడియా ఇన్‌చార్జి మోహన్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, గద్వాల జిల్లాల అధ్యక్షులు ప్రేమ్‌నాథ్‌రెడ్డి, మూర్తియాదవ్‌, సుబ్బి రెడ్డి, టీపీయూఎస్‌ నాయకులు అమర్‌నాథ్‌ యాదవ్‌, రవీందర్‌, గంధం రమేష్‌, రాజశేఖర్‌, మధు, అలకుంట కుమార్‌, మనీ రాజు, విజయ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T04:34:15+05:30 IST