నాయకుడు అండగా ఉండాలి
ABN , First Publish Date - 2020-05-14T06:08:25+05:30 IST
ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండటమే నాయకుడి లక్షణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని గంట్లకుంట
పెద్దవంగర : ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండటమే నాయకుడి లక్షణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని గంట్లకుంట గ్రామంలో బుధవారం ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పాలకుర్తి యాదగిరిరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీరాం జ్యోతిర్మయి సుధీర్, తహసీల్దార్ యోగేశ్వర్రావు, సర్పంచ్ చింతల భాస్కర్రావు, తొర్రూరు పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ వి.రామచంద్రయ్యశర్మ, ఎంపీటీసీ అనురాధ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.