కందిని మేతకొదిలారు శనగ దున్నేస్తున్నారు

ABN , First Publish Date - 2022-01-24T04:58:52+05:30 IST

తెగుళ్ల దెబ్బకు రైతులు విలవిల్లాడుతున్నారు. పచ్చని కందిపైరు చివరకు జీవాలకు మేతైంది. వర్షాలకు తోడు వైరస్‌తో శనగను రైతులు దున్నేస్తున్నారు. పీసీపల్లి మండలం పెద్దన్నపల్లికి చెందిన రైతు నెలకుర్తి మాల్యాద్రి 20 ఎకరాల్లో కంది సాగుచేశాడు. ఇటీవల కురిసిన వానలతో పైరు ఏపుగా పెరిగి పూత పిందె లేకుండా ఆకులు చెండు కట్టిపోయింది.

కందిని మేతకొదిలారు   శనగ దున్నేస్తున్నారు
పీసీపల్లిలో కంది పైరును మేస్తున్న గొర్రెలు, మేకలు

 పీసీపల్లి, నాగులుప్పలప్పాడు(ఒంగోలురూరల్‌), జనవరి 23 :  తెగుళ్ల దెబ్బకు రైతులు విలవిల్లాడుతున్నారు. పచ్చని కందిపైరు చివరకు జీవాలకు మేతైంది. వర్షాలకు తోడు వైరస్‌తో శనగను రైతులు దున్నేస్తున్నారు. పీసీపల్లి మండలం పెద్దన్నపల్లికి చెందిన రైతు నెలకుర్తి మాల్యాద్రి 20 ఎకరాల్లో కంది సాగుచేశాడు. ఇటీవల కురిసిన వానలతో పైరు ఏపుగా పెరిగి పూత పిందె లేకుండా ఆకులు చెండు కట్టిపోయింది. ఇప్పటివరకు రూ.2.5లక్షలు పెట్టుబడి పెట్టాడు. విత్త నం వేసి ఏడు నెలలు కావస్తున్నా పూత, పిందె రాలేదు. దీంతో ఆశలు వదిలేసుకుని గొర్రెలను మేపుకునేందుకు కాపరులకు వదిలేశాడు. ఆదివారం గ్రామంలోని కాపరులు కందిచేలో జీవాలను తోలి మేపుతున్న దృశ్యం ఆంధ్రజ్యోతి కంటపడింది.  

 అలాగే శనగపంటకు తెగుళ్లు రావటంతో జిల్లాలో చాలాచోట్ల రైతులు దున్నేస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరంలో సాగు చేసిన శనగ పైరును ఆదివారం ట్రాక్టర్లతో దున్నడం ఆంధ్రజ్యోతి కంటపడింది. ఆ గ్రామపరిధిలో 80 శాతంపైగా శనగ సాగు చేశారు. అయితే వర్షాల కారణంగా ముదురు శనగకు ఎండు తెగులు రావడంతో 20 ఎకరాల్లో తీసేశారు. ఇప్పటికే రైతులు ఎకరానికి 20వేలకు పైగా ఖర్చు చేశారు. చుట్టుపక్కల మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.




Updated Date - 2022-01-24T04:58:52+05:30 IST