కర్నూలులో చిరుత పులి హల్‌చల్

ABN , First Publish Date - 2020-06-06T13:41:29+05:30 IST

కర్నూలులో చిరుత పులి హల్‌చల్

కర్నూలులో చిరుత పులి హల్‌చల్

కర్నూలు: జిల్లాలోని మహానంది దేవస్థానం సమీపంలో చిరుత పులి హల్ చల్ చేసింది. గోశాల సమీపంలో సంచరిస్తున్న పంది పిల్లను చిరుత నోట కరుచుకొని చెట్టు ఎక్కింది. పందులు గుముగూడి అరవడంతో చిరుత పంది పిల్లను వదిలేసి చెట్టు మీద నుంచి దూకి పక్కనే ఉన్న అడవి వైపు వెళ్లి చెట్ల పొదల్లో నక్కింది. కాసేపటి తర్వాత చిరుత పులి పందుల గుంపుపై దాడి చేసి పంది పిల్లను నోట కరుచుకొని అడవిలోకి వెళ్లి పోయింది. ఈ దృశ్యాల్ని గోశాల వద్ద ఉన్న కాపలాదారు తిలకించి విషయాన్ని మహానంది దేవస్థానం అధికారులు, స్థానికులకు తెలియజేశారు. దీంతో దేవస్థానం అధికారులు వెంటనే చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారంతో మహానంది వాసులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2020-06-06T13:41:29+05:30 IST