కుందా సత్యనారాయణ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-24T05:48:14+05:30 IST

సురేంద్రపురి, కుందా కళాధామం వ్యవస్థాపకుడు, పారిశ్రామిక వేత్త కుందా సత్యనారాయణ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ, నిత్యన్నదాన సత్రం ట్రస్టు చైర్మన్‌ అయిత రాములు అన్నారు. భువనగిరి మండ లంలోని వడాయిగూడెం శివారులోని వైఎల్‌ఎన్‌ఎస్‌ వాసవీ ని

కుందా సత్యనారాయణ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
కుందా సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

భువనగిరి రూరల్‌, జనవరి 23: సురేంద్రపురి, కుందా కళాధామం వ్యవస్థాపకుడు, పారిశ్రామిక వేత్త కుందా సత్యనారాయణ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ, నిత్యన్నదాన సత్రం ట్రస్టు చైర్మన్‌ అయిత రాములు అన్నారు. భువనగిరి మండ లంలోని వడాయిగూడెం శివారులోని వైఎల్‌ఎన్‌ఎస్‌ వాసవీ నిత్యన్నదాన సత్రంలో ఆదివారం కుందా సత్యనారాయణ చిత్ర పటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యన్నదాన సత్రానికి ఎకరం స్థలాన్ని విరాళంగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మారుత వెంకటేశం, గట్టు కృష్ణమూర్తి, మంచాల ప్రభాకర్‌, కుందా ప్రతిభ, మేనేజర్‌ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:48:14+05:30 IST