లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. రోడ్డుపైకి వస్తున్న జనం

ABN , First Publish Date - 2020-03-30T20:55:45+05:30 IST

ప్రభుత్వ ఉత్తర్వులను జనాలు ఉల్లంఘిస్తున్నారు.

లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. రోడ్డుపైకి వస్తున్న జనం

హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులను జనాలు ఉల్లంఘిస్తున్నారు. అనేకచోట్ల ద్విచక్రవాహనాలపై ఇద్దరు వెళ్లరాదన్న నిబంధనలు ఉన్నప్పటికీ దానిని తుంగలోతొక్కేస్తున్నారు. అత్యవసరం కాకపోయినా జనాలు రోడ్లపైకి వచ్చి శిక్షకు గురౌతున్నారు. ఆంక్షల సడలింపును ఆసరాగా చేసుకుని అనవసరంగా రోట్లపైకి వస్తున్నవారిపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప రోడ్లపైకి జనాలు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-03-30T20:55:45+05:30 IST