ముందువెళుతున్న వాహనాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-06-14T05:28:37+05:30 IST

ముందువెళుతున్న వాహనాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్‌ మృతి

ముందువెళుతున్న వాహనాన్ని ఢీకొన్న లారీ.. డ్రైవర్‌ మృతి
లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ రాంరెడ్డి

కీసర రూరల్‌ : ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొని ఓ లారీడ్రైవర్‌ మృతిచెందిన ఘటన శనివారం అర్ధరాత్రి కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్‌ నుంచి శామీర్‌పేట వైపుకు వెళ్తున్న లారీ(టీఎస్‌15 యూబీ3456) కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో లారీ ముందుభాగం బాగా దెబ్బతింది. ఈ క్రమంలో డ్రైవర్‌ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. ఔటర్‌ రింగ్‌రోడ్డు పెట్రోలింగ్‌ సిబ్బంది, కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రున్ని రక్షించేందుకు ప్రయత్నించారు. లారీ క్యాబిన్‌లోంచి అతడిని ఎట్టకేలకు బయటకు తీసి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా ప్రాణాలొదిలాడు. మృతుడు లింగంపల్లికి చెందిన రాంరెడ్డి(45)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-06-14T05:28:37+05:30 IST