మోటారు బైకును ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2020-09-25T11:25:30+05:30 IST

మండలంలోని మాధవరం గ్రామం రాళ్లవంక వద్ద కడప-చెన్నై జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు

మోటారు బైకును ఢీకొన్న లారీ

ఇద్దరు మృతి - ఒకరికి తీవ్రగాయాలు 


సిద్దవటం, సెప్టెంబరు 24 :  మండలంలోని మాధవరం గ్రామం రాళ్లవంక వద్ద కడప-చెన్నై జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు... బాకరాపేట సమీపంలోని మిట్టప ల్లెకు చెందిన గంగమ్మగారి ప్రతా్‌పనాయుడు(35), నవనీశ్వర్‌నాయుడు (24)లు బైక్‌పై మాధవరం వెళుతుండగా వెనుక వైపు నుంచి లారీ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కింద పడటంతో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. వీరితో పాటు ప్రయాణిస్తున్న వెంకటరమణ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నారని, లారీని సీజ్‌ చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించామని సిద్దవటం ఇన్‌చార్జి ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు. 

Updated Date - 2020-09-25T11:25:30+05:30 IST