గొడవలకు దారి తీసిన ప్రేమ పెళ్లి

ABN , First Publish Date - 2021-08-02T07:00:20+05:30 IST

మెట్‌పల్లి పట్టణంలోని సింగపూర్‌లో ఆదివారం ప్రేమ పెళ్లి గొడవలకు దారి తీసింది. ప్రేమ పెళ్లి చేసుకుందని అమ్మా యి కుటుంబ సభ్యులు, అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడికి దిగి అ మ్మాయిని లాకెళ్లారు.

గొడవలకు దారి తీసిన ప్రేమ పెళ్లి
ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న జంట

ఫఅబ్బాయి ఇంటిపై అమ్మాయి కుటుంబ సభ్యుల దాడి ఫసింగపూర్‌లో ఉద్రిక్తం

మెట్‌పల్లి, ఆగస్టు 1: మెట్‌పల్లి పట్టణంలోని సింగపూర్‌లో ఆదివారం ప్రేమ పెళ్లి గొడవలకు దారి తీసింది. ప్రేమ పెళ్లి చేసుకుందని అమ్మా యి కుటుంబ సభ్యులు, అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడికి దిగి అ మ్మాయిని లాకెళ్లారు. ఈ సంఘటనతో పట్టణంలో ఉద్రిక్థత పరిస్థితులు నెలకొన్నాయి. మెట్‌పల్లి పట్టణానికి చెందిన సౌమ్య సింగపూర్‌కు చెంది న ప్రవీణ్‌ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. జూలై 4న హైదా రాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వీరు పెళ్లి చేసుకున్నారు. విషయం తెలు సుకున్న అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని పెళ్లైన రెండు రోజులకు తీసుకెళ్లారు. దీంతో ప్రవీణ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసు లు ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడినా అమ్మాయిని పంపించేందుకు ఒప్పుకోలేదు. ఆదివారం రోజున సౌమ్య ప్రవీణ్‌ ఇంటికి వెళ్లింది. ఆగ్రహా నికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటి వద్దకు వెళ్లి  కుటుంబ సభ్యులపైన దాడికి దిగారు. వార్డుకు చెందిన పలువురు మ హిళలు అడ్డం వస్తే వారిపైనా దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అబ్బాయి ఇంటిపై దాడి చేసి అమ్మాయిని లాకెళ్లినట్లు ప్రవీ ణ్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగా రు. సంఘటన స్థాలానికి మెట్‌పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ ఎల్‌ శ్రీని వాస్‌, ఎస్‌ఐ సధాకర్‌లో చేరుకుని అబ్బాయి కుటుంబ సభ్యులను శాం తింపజేశారు. 

Updated Date - 2021-08-02T07:00:20+05:30 IST