ప్రేమజంట ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-06T06:20:52+05:30 IST

లింగా పూర్‌ మండలం పిప్లతాండ సమీపంలోని అటవీ ప్రాంతం లో బుధవారం ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడింది

ప్రేమజంట ఆత్మహత్య

లింగాపూర్‌, ఆగస్టు5: లింగా పూర్‌ మండలం పిప్లతాండ సమీపంలోని అటవీ ప్రాంతం లో బుధవారం ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడింది. లింగా పూర్‌ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మడావి నాగుబాయి(20), జైనూర్‌ మండలం రాశిమెట్ట గ్రామానికి చెందిన ఆత్రం భీంరావు(22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నాగుబాయి రాశిమెట్టలో ఉంటున్న తన సోదరి వద్ద కొద్ది రోజులు ఉంది. అప్పుడే భీంరావుతో కలిగిన పరిచయం ప్రేమగా మారింది. మంగళవారం సాయంత్రం వారి వారి ఇళ్ల నుంచి బయలుదేరిన వీరు బుధవారం అడవిలోకి వెళ్లి పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని పశువుల కాపరులు గమనించి జైనూర్‌ పోలీసులకు సమాచారం అందించారు.


సీఐ సురేష్‌ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లే సమయానికే నాగుబాయి మృతిచెందగా, కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్న భీంరావును వైద్య చికిత్స కోసం తరలించే క్రమంలోనే మృతి చెందాడు. సంఘటన స్థలంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో లభించింది. తనకు కడుపు నొప్పిగా ఉందని, జైనూర్‌ ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పి నాగుబాయి ఇంటి నుంచి బయలుదేరినట్లు మృతురాలి తల్లి సోంబాయి మీడియాకు వెల్లడించింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించనే భయంతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-08-06T06:20:52+05:30 IST