రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-09-25T11:27:21+05:30 IST

అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు తాడిపత్రి

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

కడప (క్రైం), సెప్టెంబరు 24: అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు తాడిపత్రి - జూటూరు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 30 సంవత్సరాలు ఉంటుందని, పింక్‌ లైట్‌ కలర్‌ ఫుల్‌ షర్టును, లైట్‌ సిమెంటు కలర్‌ ఫ్యాంటు ధరించాడని, చొక్కా కాలర్‌పై ఎక్సెల్‌ టైలరు, అప్సరా సర్కిల్‌, కడప అనే లేబుల్‌ ఉందని తెలిపారు. మృతుడు కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నామని, ఇతర వివరాలకు 80740 48285 నెంబరుకు ఫోను చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చన్నారు. 

Updated Date - 2020-09-25T11:27:21+05:30 IST