కాలువలోపడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-17T08:00:10+05:30 IST

కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన శనివారం తిరుపతిలో జరిగింది. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల మేరకు..

కాలువలోపడి వ్యక్తి మృతి
రఘు మృతదేహం

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 16: కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన శనివారం తిరుపతిలో జరిగింది. అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. కార్వేటినగరానికి చెందిన రఘు (35) నిర్మాణ రంగంలో పనిచేస్తూ భార్య, ఇద్దరు బిడ్డలతో బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. దసరా పండగ సందర్భంగా ఎనిమిది రోజుల కిందట భార్య, పిల్లలతో కలిసి ఇస్కాన్‌ సమీపంలోని టీటీడీ క్వార్టర్స్‌లో ఉంటున్న అత్తింటికి వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగిరాలేదు. శనివారం ఉదయానికి క్వార్టర్స్‌కు సమీపంలోని హరేరామ మార్గంలో రోడ్డు పక్కనున్న కాలువలోపడి మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇతను మద్యానికి బానిస అయినట్లు విచారణలో తేలిందని సీఐ పేర్కొన్నారు. మద్యం ఎక్కువగా తాగడం వల్లే కాలువలోపడి మృతి చెందినట్టు భావిస్తున్నట్టు చెప్పారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-17T08:00:10+05:30 IST