అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-14T05:16:58+05:30 IST
అల్లాదుర్గంలోని ఓ వ్యవసాయ పంట చేను వద్ద గల పశువుల పాకలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక ఏఎ్సఐ గాలయ్య తెలిపారు.
అల్లాదుర్గం, ఏప్రిల్ 13 : అల్లాదుర్గంలోని ఓ వ్యవసాయ పంట చేను వద్ద గల పశువుల పాకలో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక ఏఎ్సఐ గాలయ్య తెలిపారు. ఏఎ్సఐ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన తమ్మనగారి సాయిలు (38) తన ఇంటి నుంచి సోమవారం సాయంత్రం వెళ్లాడు. అయితే మంగళవారం గ్రామంలోని ఓ రైతు పంట చేను వద్ద గల పశువుల పాకలో సాయి లు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండటంతో ఆ రైతుతో పాటు స్థానికులు మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో మృతుడి కుటుంబీకులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడు సాయిలు నోటిలో నూడిల్స్ (ఫాస్ట్ఫుడ్) ఉన్నాయన్నారు. ఈ ఘటనపై మృతుడి తల్లి పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్సఐ తెలిపారు.