చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-03-02T06:05:03+05:30 IST
అనారోగ్యంతో బాధపడుతూ గడ్డిమందు తాగి అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
చేగుంట, మార్చి 1: అనారోగ్యంతో బాధపడుతూ గడ్డిమందు తాగి అస్వస్థతకు గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. చేగుంట ఎస్ఐ సుభా్షగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని పోతన్పల్లికి చెందిన మంగలి ఎల్లం(26) ఆరోగ్యం బాగా లేక మనస్థాపానికి గురై పొలం వద్ద గడ్డి మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే తూప్రాన్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరచగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు