సానిటైజర్ తాగి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-08-01T01:07:00+05:30 IST
జిల్లాలో సానిటైజర్ తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. గన్నేరువరం
కరీంనగర్: జిల్లాలో సానిటైజర్ తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. గన్నేరువరం మండలంలోని చాకలివాని పల్లిలో సానిటైజర్ తాగి షేక్ సైదా మృతి చెందాడు. భవన నిర్మాణ కార్మికుడిగా షేక్ సైదా పని చేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడి దానికి షేక్ సైదా బానిస అయ్యాడు. మద్యం అనుకుని సానిటైజర్ తాగి సైదా మరణించాడు.