భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-09-21T07:45:36+05:30 IST

ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడ్డ ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం

భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

హైదర్‌నగర్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడ్డ ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ లక్ష్మినారాయణ కథనం ప్రకారం... కేపీహెచ్‌బీకాలనీ మలేషియా టౌన్‌షి్‌పలోని ఐదో అంతస్తులో నివాసముండే గన్నమనేని రామదాసు(75) ఇంట్లోనే మొక్కలు పెంచుతుంటారు. ఆదివారం వేకువజామున  రోజువారీ మాదిరిగానే మొక్కలను పరిశీలిస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత చూస్తే అపార్ట్‌మెంట్‌ కింద పార్కింగ్‌ స్థలంలో రామదాసు పడి ఉన్నాడు. గమనించిన వాచ్‌మన్‌ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అప్పటికే రామదాసు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. మొక్కలకు నీళ్లు పోస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2020-09-21T07:45:36+05:30 IST