బావిలో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-02-24T05:29:19+05:30 IST

మండలంలోని నర్సిపురంలో కొప్పర సత్యనారాయణ (45) అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందారు.

బావిలో పడి వ్యక్తి మృతి

పార్వతీపురం రూరల్‌, ఫిబ్రవరి 23: మండలంలోని నర్సిపురంలో కొప్పర సత్యనారాయణ (45) అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్యనారాయణ మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. గ్రామ శివారు ప్రాంతంలోగల నేలబావిలో సత్యనారాయణ మృతదేహం మంగళవారం లభించింది. మృతునికి రేచీకటి ఉన్నట్లు  కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై ఎస్‌ఐ వీరబాబు వద్ద ప్రస్తా వించగా, సత్యనారాయణ రే చీకటి కారణంగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని  చెప్పారు. మృతునికి భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 


Updated Date - 2021-02-24T05:29:19+05:30 IST