బైక్‌ పై నుంచి కిందపడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-04-20T05:41:01+05:30 IST

బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కిందపడి మృతి చెందిన సంఘటన నర్సాపూర్‌ సమీపంలో సంగారెడ్డి-తూప్రాన్‌ రహదారిపై సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

బైక్‌ పై నుంచి కిందపడి వ్యక్తి మృతి

నర్సాపూర్‌, ఏప్రిల్‌ 19: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కిందపడి మృతి చెందిన సంఘటన నర్సాపూర్‌ సమీపంలో సంగారెడ్డి-తూప్రాన్‌ రహదారిపై సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. శివ్వంపేట మండలం గూడురుకు చెందిన బాలేష్‌ (41) మిషన్‌ భగీరథలో పనిచేస్తుంటాడు. సోమవారం ఆయన బైక్‌పై శివ్వంపేట వైపు వెళ్లడానికి నర్సాపూర్‌ నుంచి బయలుదేరాడు. పట్టణానికి సమీపంలో హన్మంతాపూర్‌ రోడ్డు సమీపంలో రోడ్డు పక్కన ఆయన పడిఉండగా స్థాకులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు పరిశీలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఏదైనా వాహనం ఢీకొట్టిందా.. లేక ఫిట్సు వల్ల చనిపోయి ఉంటాడా అనే విషయంపై అనుమానాలు నెలకొనడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.


 

Updated Date - 2021-04-20T05:41:01+05:30 IST