మహిళ మృతికి కారణమైన వ్యక్తి అరెస్టు
ABN , First Publish Date - 2020-08-05T11:43:17+05:30 IST
మహిళను తలపై రాడ్తో కొట్టి ఆమె మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్టు ట్రైనీ డీఎస్పీ వై.శృతి తెలిపారు.
కొవ్వూరు, ఆగస్టు 4 : మహిళను తలపై రాడ్తో కొట్టి ఆమె మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్టు ట్రైనీ డీఎస్పీ వై.శృతి తెలిపారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడికి చెందిన ఆనిమిల్లి నరేశ్ భార్య సుధారాణితో జూలై 22న ఘర్షణ పడి, ఆమెను తీసుకుపొమ్మని అత్తగారు కొల్లి కొండమ్మకు ఫోన్ చేశాడు. దీంతో కొండమ్మ తన కోడలు కొల్లి నాగమణితో కలిసి ఆటోలో అల్లుడింటికి వెళ్లింది. ఎందుకు ఘర్షణ పడుతున్నావని నరేశ్ను నిలదీయడంతో నాగమణిని రాడ్తో తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో నాగమణితో పాటు కొండమ్మ, ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురు రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నాగమణి జూలై 23న మృతి చెందింది. దీనిపై అప్పటి రూరల్ ఏఎస్ఐ ఎస్.శ్రీనివాసరావు కేసు నమోదు చేయగా రూరల్ సీఐ ఎం.సురేశ్ దర్యాప్తు కొనసాగించారు. నాగమణి మృతికి కారణమైన నరేశ్ను మంగళవారం ట్రైనీ డీఎస్పీ వై.శృతి అరెస్టు చేశారు.