సేవతోనే జీవితానికి సార్థకత: చింతల
ABN , First Publish Date - 2021-10-18T06:02:01+05:30 IST
సేవతోనే మనిషి జీవితానికి సార్థకత అని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
వాల్మీకిపురం, అక్టోబరు 17: సేవతోనే మనిషి జీవితానికి సార్థకత అనీ, చేసిన మంచి పనులే చిరకాలం గుర్తుండిపోతాయిని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణ సమీపంలోని బాహుదానది తీరంలో వెలసిన ఉమామహేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి పలువురు దాతలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న దాతలను అభినందించి తమకున్నంతలో సాయం చేసే వారికి భగవంతుడి కృప ఉంటుందన్నారు. కార్యక్రమంలో దాత సత్యనారాయణశెట్టి, ఆలయ కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, వెంకటరమణారెడ్డి, ప్రముఖులు కృష్ణమూర్తి, వైసీపీ నాయకులు కారపాకుల భాస్కర్నాయుడు, గజ్జెల శీనురెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.