‘అటు కరోనా.. ఇటు కామెర్లు’పై స్పందించిన యంత్రాంగం
ABN , First Publish Date - 2021-04-20T06:29:35+05:30 IST
‘అటు కరోనా... ఇటు కామెర్లు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై యంత్రాంగం స్పందించింది.
- ఆర్డీవో నేతృత్వంలో పరిశీలనలు
- మంచినీటి శాంపిళ్ల సేకరణ
కోల్సిటీ, ఏప్రిల్ 19: ‘అటు కరోనా... ఇటు కామెర్లు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ సంగీతసత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్, సర్వేలైన్ ఆఫీసర్ డాక్టర్ శ్రీరాం, సీహెచ్ఓ ప్రతాప్రెడ్డి, భగీరథ ఈఈలు సోమవారం రామగుండంలో పర్యటించారు. ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కామెర్ల వ్యాధి ఎక్కువగా ఉన్న కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విఠల్నగర్ ప్రాంతంలో తాము భగీరథ నీటిని తాగడం లేదంటూ మహిళలు అధికారులతో పేర్కొన్నారు. నీటి కాలుష్యంపై ప్రత్యేకంగా ఆర్డీవో శంకర్కుమార్ ఆధ్వర్యంలో ఆరా తీశారు. కార్పొరేషన్ నీటితో పాటు ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల నుంచి నీటి శాంపిల్స్ సేకరించారు.