ఎంఈఎఫ్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2021-01-14T05:38:41+05:30 IST
నాగార్జునసాగర్లో ఈనెల 17వ తేదీన జరిగే మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లంకపల్లి నగేష్, రాష్ట్ర కో కన్వీనర్ మల్లెపాక వెంకన్న కోరారు.
నల్లగొండ టౌన్, జనవరి 13: నాగార్జునసాగర్లో ఈనెల 17వ తేదీన జరిగే మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లంకపల్లి నగేష్, రాష్ట్ర కో కన్వీనర్ మల్లెపాక వెంకన్న కోరారు. జిల్లాకేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని, ఆగస్టు 27న జస్టిస్ అరుణ్ మిశ్ర నాయకత్వంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ తీర్పును తెలుగు రాష్ర్టాలు అమలు చేయాలన్నారు. సమావేశంలో గట్టు మల్లన్న, తీగల మల్లికార్జున్, చింత లింగస్వామి, ఊదరి వెంకటేశ్వర్లు, యాదగిరి ఉన్నారు.